కర్నూలులో ఘనంగా పిడకల సంబరం

కర్నూలు జిల్లాలో పిడకల సంబరం రసవత్తరంగా సాగింది. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది తరువాత రోజు జరిగిన పిడకల సమరానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతియేటా సాంప్రదాయ బద్ధంగా జరిగే పిడకల యుద్ధంలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. ఆచారం ప్రకారం పిడకల సమరానికి ముందు కారుముంచి గ్రామానికి చెందిన రాజ వంశస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి బయలుదేరగానే.. స్వామి, అమ్మవారి వర్గీయులుగా విడిపోయిన జనం […]

కర్నూలులో ఘనంగా పిడకల సంబరం
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 11:34 AM

కర్నూలు జిల్లాలో పిడకల సంబరం రసవత్తరంగా సాగింది. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది తరువాత రోజు జరిగిన పిడకల సమరానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతియేటా సాంప్రదాయ బద్ధంగా జరిగే పిడకల యుద్ధంలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. ఆచారం ప్రకారం పిడకల సమరానికి ముందు కారుముంచి గ్రామానికి చెందిన రాజ వంశస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి బయలుదేరగానే.. స్వామి, అమ్మవారి వర్గీయులుగా విడిపోయిన జనం పిడకల రాసులపై పడ్డారు.

వీరభద్ర స్వామి కాళికాంబ ప్రేమ వివాహంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుని ఘర్షణ పడినట్లు పురాణ కథనం. దానికి ప్రతీకగా కైరుప్పల పిడకల సంబరాన్ని ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. కైరుప్పల గ్రామస్తుల, పరిసర గ్రామ ప్రజలు రెండుగా విడిపోయి ఈ సంబరాన్ని కొనసాగిస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఎవరికి వారు ప్రత్యర్థి వారిపై పిడకలతో దాడులు చేశారు. 2 గంటలకు పైగా సాగిన ఈ పిడకల సమరంలో 80మందికి గాయాలయ్యాయి. అయినా.. వీరంతా స్వామి వారి బండారు రాసుకుని కల్యాణోత్సవ ఏర్పాట్లలో మునిగిపోయారు.