బ్రీత్ ఎనలైజర్ కాదు ఏకంగా రక్త పరీక్షే, తాగి బండి నడిపితే తోలు తీస్తాం : విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ
ప్రస్తుతం కరోనా వీరవిహారం చేస్తోంది. దీంతో డ్రంకన్ డ్రైవ్ టెస్టులకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో మందుబాబులు రెచ్చిపోతున్నాయి.
ప్రస్తుతం కరోనా వీరవిహారం చేస్తోంది. దీంతో డ్రంకన్ డ్రైవ్ టెస్టులకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో మందుబాబులు రెచ్చిపోతున్నాయి. ఇష్టారాజ్యంగా తాగి..బండ్లు, కార్లతో రోడ్లెక్కుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదారాబాద్లో ఇటువంటి ఘటనలు రెండు చూశాం. ఇలా ప్రస్తుత పరిస్థితులను వాడుకుని తప్పించుకు తిరుగుతోన్న మందుబాబులు చాలామందే ఉన్నారు. తాగి కొందరు రోడ్లపై డ్రైవింగ్ చేస్తోన్న తీరుపై ప్రజలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ ఆకతాయలకు, మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. రక్త పరీక్ష చేయటం ద్వారా ఆల్కహాల్ శాతం తెలుసుకోవచ్చని…ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు
డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించే బ్రీత్ ఎనలైజర్ పరికరంలో నోటితో ఊదాల్సి ఉంటుందని..నోటి తుంపరుల వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశముందని చెప్పారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగానే తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. అందుకే రక్త పరీక్షలకు సన్నద్దం అవుతున్నట్లు చెప్పారు.
Also Read :
ALso Read :
మార్కెట్ పెంచుకునే పనిలో సూపర్ స్టార్ మహేశ్, తమిళ, కన్నడ ఇండస్ట్రీలపై దండయాత్ర
లోకనాయకుడి కుమార్తెను నేనెందుకు తగ్గుతాను, భారీ రెమ్యూనరేషన్పై శృతి ఫోకస్