ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ బంపర్ ఆఫర్..!

ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు ప్రకటించింది.

ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ బంపర్ ఆఫర్..!
Follow us

|

Updated on: Oct 23, 2020 | 8:31 AM

ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు ప్రకటించింది. 2018-21 సంవత్సరాలకు గానూ ఎల్టీసీకి సమానమైన నగదును ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2021 మార్చి 31వరకు ఏదైనా ముఖ్యమైన పండుగలకు ముందస్తు ప్యాకేజీని అందిస్తామని సీఎం కేజ్రీవాల్ సర్కారు వెల్లడించింది. కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఎల్టీసీ ప్రయాణాలు చేయలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీకి సమానమైన నగదును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. బిజినెస్ క్లాస్ విమానచార్జీలకు అర్హత ఉన్న ఉద్యోగులకు రూ.36వేలు, ఎకానమీ క్లాస్ విమానచార్జీలకు అర్హత ఉన్న వారికి రూ.20వేలు, రైలు చార్జీలకు అర్హత ఉన్న వారికి రూ.6వేలు చొప్పున ఎల్టీసీని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.