యువకుడి ప్రాణం తీసిన రాతి గుండు సరదా

స్నేహితులంతా కలిసి సరదాగా ఆడుకుంటున్న క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. రాతి గుండు ఆట సరదా ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. ఈ విషాద ఘటన

యువకుడి ప్రాణం తీసిన రాతి గుండు సరదా
Follow us

|

Updated on: Jul 06, 2020 | 2:28 PM

స్నేహితులంతా కలిసి సరదాగా ఆడుకుంటున్న క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. రాతి గుండు ఆట సరదా ఓ యువకుడి ప్రాణం బలితీసుకుంది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం సులువాయికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే, సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి సరదాగా.. బసవన్నగుడి ఆవరణలో ఉన్న 120 కిలోల రాతి గుండును ఎత్తుతూ ప్రాక్టీస్ చేసేవాళ్లు. నిన్న ఆదివారం కావడంతో స్నేహితులంతా కలిసి కాలక్షేపానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అతడు రాతి గుండును ఎత్తబోయాడు. ఆ రాయిని ఎత్తే క్రమంలో పట్టు తప్పి కాలు జారడంతో ఆ గుండు మీద పడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్న స్నేహితులు, స్థానికులు హుటాహటిన ఆస్పత్రికి తరలించారు. ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానికులు చెప్పారు. మృతిచెందిన యువకుడికి ఏడాదిన్నర క్రితమే వివాహమైనట్లుగా తెలుస్తోంది. రెండు నెలల క్రితం కొడుకు పుట్టాడని,… ఇంతలోనే రాతి గుండు రూపంలో మృత్యువు వెంటాడిందంటూ స్థానికులు వాపోయారు.