ముక్కుపుడక కోసం మృతదేహన్ని తవ్వి…దారుణం

మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కు పుడక కోసం అంత్యక్రియలు చేసి పూడ్చిపెట్టిన శవాన్ని తవ్వి బయటకు తీసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.

ముక్కుపుడక కోసం మృతదేహన్ని తవ్వి...దారుణం
Follow us

|

Updated on: Jul 03, 2020 | 4:20 PM

మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కు పుడక కోసం అంత్యక్రియలు చేసి పూడ్చిపెట్టిన శవాన్ని తవ్వి బయటకు తీసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. మెదక్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించగా…

మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో ఈ నెల 24న చనిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక గిద్దకట్ట స్మశాన వాటికలో మహిళ మృతదేహన్ని పూడ్చిపెట్టారు. అయితే, ఆ సమయంలో మృతురాలి ఒంటిపై రెండు ముక్కుపుడకలు ఉండటం గమనించిన కాటి కాపరి సంబంధీకులు దారుణానికి ఒడిగట్టారు. ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి రెండు బంగారు ముక్కు పుడకలు తీసుకున్నారు. ఆ సమయంలో అటువైపు గా వెళ్తున్న కొందరు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనితో విషయం తెలుసుకున్న మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.