Covid 19 In India: ఏపీ ప్రజలకు గుడ్న్యూస్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కోవిడ్ 19 వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు 80దేశాలకు పైగా విస్తరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి.. నెల రోజులకు పైనే అవుతున్నా.. ఇంకా మందు కూడా కనుగొనలేదు. దీంతో ప్రజల్లో రోజు రోజుకు కరోనా భయం ఎక్కువవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కోవిడ్ 19 వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు 80దేశాలకు పైగా విస్తరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి.. నెల రోజులకు పైనే అవుతున్నా.. ఇంకా మందు కూడా కనుగొనలేదు. దీంతో ప్రజల్లో రోజు రోజుకు కరోనా భయం ఎక్కువవుతోంది. ఇక భారత్లో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 29మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారు. ఇక ఏపీలోనూ 11మంది కరోనా అనుమానితులు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో వారి నమూనాలను పరీక్షించగా అందరికీ నెగటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఓ బులెటిన్ను విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని.. విదేశాల నుంచి వచ్చిన మిగిలిన వారి నమూనాలను పుణె పంపామని పేర్కొంది.
అలాగే విదేశాల నుంచి వచ్చిన వారికి పలు ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మందులు, రక్షణ కిట్లు, ఎన్ మాస్కులు నిల్వ ఉంచామని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామని.. ప్రజల సహాయం కోసం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వైరస్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. విదేశాల నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్ట్ చేశాకే బయటకు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తానికి ఇప్పటివరకైతే ఏపీలో కరోనా పాజిటివ్ లేకపోగా.. రాష్ట్ర ప్రజలకు ఇది కాస్త ఊరట కలిగించే వార్తనే.