20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు..ఏపీలో 252 మందికి కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా చేరింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే నేడు […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా చేరింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే నేడు 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువమంది ఢిల్లీలో మత ప్రార్థనలకు హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారే ఉన్నారు. ఇప్పటివరకు పాజిటివ్ గా తేలిన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 11 మంది ఉన్నారు. వారితో లింక్ లు కలిగిఉన్న మరో ఆరుగురికి వైరస్ సోకింది. వైరస్ సింటమ్స్ తో హస్పిటల్ లో జాయిన్ అయిన మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్గా తేలిందని హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.