ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు...

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్
Follow us

|

Updated on: Jan 03, 2021 | 10:31 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు. కర్నూలు జిల్లాలోని పూడిచర్ల గ్రామంలో గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన దళిత హత్య కేసులో లో మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే పొలంలో ఈ హత్య జరిగినందున పోలీసులు సరిగా విచారణ జరపడంలేదన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఘటనపై న్యాయమూర్తి రామకృష్ణతో కలిసి పూడిచర్లకు వెళ్తున్నట్లు హర్షకుమార్ తెలిపారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత ఎన్ని మానభంగాలు జరిగాయి… ఎంతమంది పై చర్యలు తీసుకున్నారన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేస్తానని హర్షకుమార్ తెలిపారు.