హరీశ్‌ రావు ఫ్లెక్సీ ఏర్పాటు.. టీఆర్‌ఎస్ నేతపై కేసు!

తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌ గౌడ్ అయ్యప్ప పూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి హరీశ్ రావుని ఆహ్వానిస్తూ.. ఆ కాలనీ అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారహక్కు కార్యకర్త విజయ్ గోపాల్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ […]

హరీశ్‌ రావు ఫ్లెక్సీ ఏర్పాటు.. టీఆర్‌ఎస్ నేతపై కేసు!
Follow us

| Edited By:

Updated on: Jan 14, 2020 | 10:34 AM

తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌ గౌడ్ అయ్యప్ప పూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి హరీశ్ రావుని ఆహ్వానిస్తూ.. ఆ కాలనీ అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారహక్కు కార్యకర్త విజయ్ గోపాల్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన పోలీసులు.. అనుమతి లేకుండా విద్యానగర్ మధ్య విస్తరించి ఉన్న డివైడర్లపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస గౌడ్‌పై ఐపీసీ 268, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.