దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి: జీవీఎల్

ఏపీ రాజధాని మార్పుపై మాటల యుద్ధం ఢిల్లీకి పాకింది. రైతులను మభ్యపెట్టాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవీఎల్ ఆరోపించారు. రాజధానిని మారుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సమాచారమిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తింస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను ఎలాంటి లబ్ధి పొందలేదని, సీఎం ఆఫీసులో కప్పు కాఫీ, గ్లాసు మంచినీళ్లు మాత్రమే తీసుకున్నానని చెప్పారు. అంతకుమించి ఏమన్నా తీసుకున్నట్టుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. గతంలో […]

దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి: జీవీఎల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2020 | 7:31 AM

ఏపీ రాజధాని మార్పుపై మాటల యుద్ధం ఢిల్లీకి పాకింది. రైతులను మభ్యపెట్టాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవీఎల్ ఆరోపించారు. రాజధానిని మారుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం సమాచారమిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తింస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను ఎలాంటి లబ్ధి పొందలేదని, సీఎం ఆఫీసులో కప్పు కాఫీ, గ్లాసు మంచినీళ్లు మాత్రమే తీసుకున్నానని చెప్పారు. అంతకుమించి ఏమన్నా తీసుకున్నట్టుగా నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. గతంలో సవాల్ చేశా.. ఇప్పుడూ చేస్తున్నా.. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని టీవీ9 బిగ్ డిబేట్ వేదికగా టీడీపీ నేతలకు సవాల్ విసిరారు జీవీఎల్.