బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీకి కరోనా వైరస్ పాజిటివ్

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కోవిడ్-19 కి గురయ్యారు. తనకు  కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని, పాట్నాలోని ఎయిమ్స్ లో చేరానని ఆయన ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా తనకు ఎలాంటి టెంపరేచర్ లేదని, లంగ్స్ సీటీ స్కాన్ నార్మల్ గా ఉందని తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో ఉండదలిచానన్నారు. త్వరలో బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల […]

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీకి కరోనా వైరస్ పాజిటివ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2020 | 4:46 PM

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కోవిడ్-19 కి గురయ్యారు. తనకు  కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని, పాట్నాలోని ఎయిమ్స్ లో చేరానని ఆయన ట్వీట్ చేశారు. గత రెండు రోజులుగా తనకు ఎలాంటి టెంపరేచర్ లేదని, లంగ్స్ సీటీ స్కాన్ నార్మల్ గా ఉందని తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో ఉండదలిచానన్నారు. త్వరలో బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 28 న తొలిదశ, అనంతరం నవంబరు 3, 7 తేదీలలో రెండు, మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. సుశీల్ మోడీ గత ఆదివారం సీఎం నితీష్ కుమార్ తో కలిసి రెండు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.