ఆ డాక్టర్.. కారునే తాత్కాలిక గృహంగా..
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఓ డాక్టర్ తన కారునే తాత్కాలిక గృహంగా మార్చుకున్న
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఓ డాక్టర్ తన కారునే తాత్కాలిక గృహంగా మార్చుకున్న ఆదర్శ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరానికి చెందిన డాక్టర్ సచిన్ నాయక్ కరోనా రోగుల వార్డులో వైద్యసేవలందిస్తున్నారు. డాక్టర్ సచిన్ ముందు జాగ్రత్తగా కారులోనే ఐసోలేషన్లో ఉంటూ అందులోనే నిద్రిస్తున్నారు.
కాగా.. ‘‘నేను కరోనా రోగులకు చికిత్స చేస్తున్నందు వల్ల ముందు జాగ్రత్తగా నా కుటుంబసభ్యులకు దూరంగా కారునే తాత్కాలిక నివాసంగా మార్చుకొని, గత ఏడు రోజులుగా అందులోనే ఐసోలేషన్లో ఉంటున్నాను’’ అని డాక్టర్ సచిన్ నాయక్ చెప్పారు. కాగా వైద్యులకు హోటళ్లలో వసతి సౌకర్యాలు కల్పిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి, దాని కోసం సన్నాహాలు చేస్తోంది. హోటల్ గదులను శానిటైజ్ చేసి రూం కేటాయిస్తే తాను అక్కడికి వెళతానని డాక్టర్ సచిన్ చెప్పారు. హోటల్ గది కేటాయించే వరకూ తాను కారులోనే నిద్రిస్తున్నానని డాక్టర్ వివరించారు.