కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: Nov 03, 2020 | 6:15 PM

ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,30,731కు చేరింది.  మరో 15 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. . తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,734 మంది వైరస్‌తో మృతి చెందారు.  3,700 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 8 లక్షలు దాటింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 21,672 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Also Read :

Breaking : చిత్తూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా, ముగ్గురు మృతి

వరుసకు కూతురిపై అత్యచారయత్నం.. ప్రతిఘటించడంతో భార్యతో కలిసి హత్య..