ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం.. చివరి అంకానికి చేరుకుంటోంది. అధికార వైసీపీ మరోసారి ప్రజాకర్షక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చింది. పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలో కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. చెప్పిందే చేస్తామనీ… చేసేదే చెప్తామనీ స్పష్టం చేశారు సీఎం జగన్..
నవరత్నాలను యథాతథంగా ముందుకు తీసుకెళ్తామన్న జగన్మోహన్రెడ్డి… తాను చేతకాని హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు అవినీతికి తావులేకుండా పేదలకు సంక్షేమఫలాలు అందించామన్న జగన్… అలవిగాని హామీలిచ్చి కూటమి పార్టీలు ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేసిన జగన్… విపక్షాలు చెబుతున్న సూపర్ సిక్స్ను అమలు చేయడం అసాధ్యమన్నారు.
ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ ప్రజల్లోకి వెళ్తోంది విపక్ష కూటమి. ఉమ్మడి మేనిఫెస్టోనూ సిద్ధం చేస్తోంది. మరి, అధికార పార్టీకి ధీటుగా ఎలాంటి ఎన్నికల ప్రణాళికతో ముందుకు వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మేనిఫెస్టో మంత్రం పఠిస్తున్నాయి పార్టీలు. మరి, ఎవరి ప్రణాళిక ఆచరణ సాధ్యమో… ఎవరి హామీలకు ప్రజామోదం లభిస్తుందో చూడాలి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..