చంద్రగిరి రీపోలింగ్.. అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతాం: డీఐజీ
చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు స్థానాల్లో ఆదివారం రీపోలింగ్ జరగనుంది. దీంతో ఆయా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. రీపోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని.. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండరాదని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అలజడులు సృష్టించేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆయన పేర్కొన్నారు. రీపోలింగ్లో పార్టీల నేతలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు స్థానాల్లో ఆదివారం రీపోలింగ్ జరగనుంది. దీంతో ఆయా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. రీపోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని.. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఉండరాదని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర అలజడులు సృష్టించేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఆయన పేర్కొన్నారు. రీపోలింగ్లో పార్టీల నేతలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.