Andhra Pradesh: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యేను కావలి మండలం బట్లదిన్నె గ్రామస్తులు నిలదీశారు. ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. గ్రామంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై గ్రామస్తులు ప్రశ్నించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చెప్పేది నోరు మూసుకోని వినాలంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి.
ఇప్పటికే రోడ్డు సాంక్షన్ అయింది. త్వరలోనే పనులు ప్రారంభించి రోడ్డు పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి. ఈ రోడ్డు వేయించపోతే మీ ఊరు ఇక రానని.. తన మీద నమ్మకం ఉంచుకోవాలని చెప్పారు. రోడ్డు వేయించకపోతే ఓట్లు కూడా అడగనని చెప్పారు ఎమ్మెల్యే. వాడెవడో తెలుగుదేశం వాడు మాట్లాడారని మీరు మాట్లాడొద్దందంటూ బట్లదిన్నె గ్రామస్తులకు సూచించారు ఎమ్మెల్యే. బట్లదిన్నె గ్రామస్తులకు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..