Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని(Andhra Pradesh) సామాన్యుడి ఘోష వినేందుకు జనసేన పార్టీ జనవాణి జనసేన భరోసా (Janavani Janasena Bharosa) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేడు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆయన నేరుగా ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్యం 3 గంటల వరకూ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. కార్యక్రమం కోసం జనసేన నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్ననే పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు.
ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు.. సామాన్యుడి కష్టలను తెలుసుకొనేందుకు ప్రతి ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. మళ్ళీ 10వ తేదీన విజయవాడలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించనుండగా.. తర్వాత రెండు వారాలు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజల నుంచి సమస్యలను తీసుకుని నేరుగా ప్రభుత్వానికి తెలియచేయడమే జనవాణి కార్యక్రమం ముఖ్యోద్దేశ్యమని జనసేన నేతలు చెప్పారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..