Andhra Pradesh: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ.. బయటకు లాగి కత్తితో నరికిన యువకుడు..

|

Oct 20, 2022 | 5:10 PM

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయాడో వ్యక్తి. జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్‌రాజుపాలెంలో చోటు చేసుకుంది ఈ ఘటన...

Andhra Pradesh: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ.. బయటకు లాగి కత్తితో నరికిన యువకుడు..
Representative Image
Follow us on

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయాడో వ్యక్తి. జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్‌రాజుపాలెంలో చోటు చేసుకుంది ఈ ఘటన. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ ఆటోలో వెళ్తుండగా.. ఒక్కసారిగా వచ్చిన యువకుడు ఆమెను బలవంతంగా బయటకు లాగాడు. ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో మహిళ రెండు చేతులకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు.

వెంటనే అలర్ట్ అయిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు వైద్యులు. కాగా, యువతిపై దాడి చేసిన వ్యక్తి లేగుంటపాడుకు చెందిన సురేష్‌గా గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. సురేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే, యువతిపై సురేష్ ఎందుకు దాడి చేశాడనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..