
కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే.. ప్రాణాలను పణంగా పెట్టాలా? జరుగుతున్న ప్రమాదాలను చూసి సగటు మనిషికి కలుగుతున్న అభిప్రాయం ఇది. ఎందుకంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని చూసినవాళ్లు.. అంత పెద్ద సంస్థల్లో.. అందునా రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీల్లో పనిచేసేవారి ప్రాణాలకు విలువ లేదా? వారికి యాజమాన్యాలు.. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేవా? వారికి భద్రతను కల్పించలేవా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనను పెంచుతున్నాయి. రియాక్టర్ల పేలుళ్లు ఏకంగా ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి. Atchuthapuram Blast 1 అచ్యుతాపురం సెజ్ లో 208 పరిశ్రమలు ఉంటే.. పరవాడ జేఎన్ ఫార్మా సిటీలో సుమారు 90 సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో 130 వరకు రెడ్ కేటగిరీవే. 2009లో ఏర్పాటు అయిన అచ్యుతాపురం సెజ్ లో ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన అని చెప్పవచ్చు. అంతకుముందు.. అంటే 1997లో HPCLలో రిఫైనరీ పేలింది. ఆ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. Atchuthapuram Blast 2 కంపెనీ.. భద్రత విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సంస్థ దుర్ఘటనే నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. రెడ్ క్యాటగిరీ కంపెనీలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. కారణాలు ఏవైనా సరే.. సరైన ప్రొసీజర్ ఫాలో...