గిద్దలూరు మండలంలో భారీగా మ‌ద్యం నిల్వ‌లు..ఎవ‌రింట్లోనో తెల్సా..?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో మందుబాబులు లిక్కర్ దొర‌క్క పిచ్చెక్కిపోతున్నారు. ఈ స‌మ‌యంలో కూడా ఓ వైసీపీ నేత భారీగా మద్యం నిల్వలతో పట్టుబడటం సంచ‌ల‌నంగా మారింది. పలుచోట్ల భారీగా మద్యం నిల్వలున్నాయన్న సమాచారంతో… ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అక్కడి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో భారీగా అక్ర‌మ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. 1200 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు… ఓ […]

గిద్దలూరు మండలంలో భారీగా మ‌ద్యం నిల్వ‌లు..ఎవ‌రింట్లోనో తెల్సా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 3:28 PM

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో మందుబాబులు లిక్కర్ దొర‌క్క పిచ్చెక్కిపోతున్నారు. ఈ స‌మ‌యంలో కూడా ఓ వైసీపీ నేత భారీగా మద్యం నిల్వలతో పట్టుబడటం సంచ‌ల‌నంగా మారింది. పలుచోట్ల భారీగా మద్యం నిల్వలున్నాయన్న సమాచారంతో… ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అక్కడి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో భారీగా అక్ర‌మ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. 1200 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు… ఓ కారు, టూ వీల‌ర్ ను సీజ్‌ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇటీవ‌లే గడికోట ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో అక్ర‌మ మ‌ద్యం ల‌భించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.