AP Rains: తుఫాన్ అలెర్ట్.! ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు మోస్తరు వర్షాలు.. అప్రమత్తత అవసరం..

ఐఎండి సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుందని ఉత్తరం వైపుగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం..

AP Rains: తుఫాన్ అలెర్ట్.! ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు మోస్తరు వర్షాలు.. అప్రమత్తత అవసరం..
Rain Alert
Follow us

|

Updated on: May 25, 2024 | 8:06 PM

ఐఎండి సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శనివారం రాత్రికి తుపానుగా బలపడుతుందని ఉత్తరం వైపుగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం-ఖేపుపరా మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు.

దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి సగటున 5.8 కిమీ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని.. మరో ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని తెలిపారు. రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శనివారం సాయంత్రం 6 గంటల నాటికి అనంతపురం రాయదుర్గంలో 38.5మిమీ, విజయవాడ తూర్పులో 34.5మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 30.5మిమీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 30.5మిమీ, విజయవాడ సెంట్రల్ లో 30.2మిమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 29.2మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 27.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 25 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు.