బ్రాహ్మణులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్..!.. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవే..

జగన్ సర్కార్ ఏపీలోని పేద బ్రహ్మణ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. ఇకపై ఏడేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య వయస్సున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన (ఒడుగు) ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసేలా.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకోంటోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ ద్వారా దీనిని అమలు […]

బ్రాహ్మణులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్..!.. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవే..
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 4:52 AM

జగన్ సర్కార్ ఏపీలోని పేద బ్రహ్మణ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. ఇకపై ఏడేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య వయస్సున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన (ఒడుగు) ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసేలా.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకోంటోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ ద్వారా దీనిని అమలు చేయనున్నారు.

కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.100 కోట్లతో పలు స్కీంలు అమలవుతున్నాయని.. 15 వేల మంది బ్రాహ్మణులకు ప్రతి నెలా పింఛను అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేదవ్యాస, గాయత్రి, కల్యాణమస్తు, గరుడ, భారతి తదితర స్కీంల కింద ఇప్పటి వరకు 22,056 మంది లబ్ధిదారులను గుర్తించామని.. త్వరలో వారందరికీ ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాదు.. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బ్రాహ్మణ యువతకు “భారతి” స్కీం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని.. దీనికి సంబంధించిన దరఖాస్తులను బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. అంతేకాదు.. ఈ స్కీంలో ఒక విడత ఆర్థిక సహాయం పొందిన వారికి మరోసారి ఆర్థిక సహాయాన్ని అందివ్వరు. కనీసం ఏడాది కాలం పాటు మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి విదేశీ యూనివర్సిటీల్లో అడ్మీషన్స్ పొందిన మాత్రమే ఈ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను వెబ్ పోర్టల్‌ (http://www.andhrabrahmin.ap.gov.in/) లో చూసి అర్హులు అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.