CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు.. కేంద్రం పెద్దలతో చర్చించే అంశాలివే..

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. విభజన హామీలతో పాటు మరిన్ని ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా సుదీర్ఘంగా చర్చించేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదించే బడ్జెట్లో ఏపీకి నిధులు గతంకంటే అధికంగా కేటాయించాలని విజ్ఙప్తి చేసేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు.. కేంద్రం పెద్దలతో చర్చించే అంశాలివే..
Cm Chandrababu
Follow us

|

Updated on: Jul 01, 2024 | 11:50 AM

అమరావతి, జూలై 1: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. విభజన హామీలతో పాటు మరిన్ని ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా సుదీర్ఘంగా చర్చించేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదించే బడ్జెట్లో ఏపీకి నిధులు గతంకంటే అధికంగా కేటాయించాలని విజ్ఙప్తి చేసేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలను సత్వరం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కోరనున్నారు. దీంతో పాటు పెండింగ్ బకాయిలు, రావల్సిన నిధుల విషయంలో కూడా కేంద్ర పెద్దలను ఒప్పించేందుకు భేటీ కానున్నారు. ఈ భేటీ తరువాత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఒక స్పష్టత వస్తే రాష్ట్ర బడ్జెట్‎పై ముందుకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

మోదీ ప్రమాణస్వీకారం తరువాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ఆయన టూర్‎పై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రకటన వెలువడనుంది, ఎన్ని నిధులు వస్తాయన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఇదిలా ఉంటే జూన్ 29న ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బిహార్ సీఎం నితీష్‌ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అదే విధంగా ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చిస్తారా అన్న కోణంలో కూడా ఒక వర్గం నుంచి చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..