అడివి శేషుకి అరుదైన గౌరవం

టాలీవుడ్‌ యంగ్ హీరో అడివి శేషు అరుదైన గౌరవం అందుకున్నారు. అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ ప్రెస్‌ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ జర్నలిస్ట్‌ కిరణ్ రాయ్‌ అనౌన్స్ చేసిన

అడివి శేషుకి అరుదైన గౌరవం
Follow us

| Edited By:

Updated on: Nov 03, 2020 | 1:42 PM

Adivi Sesh rare honor: టాలీవుడ్‌ యంగ్ హీరో అడివి శేషు అరుదైన గౌరవం అందుకున్నారు. అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ ప్రెస్‌ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ జర్నలిస్ట్‌ కిరణ్ రాయ్‌ అనౌన్స్ చేసిన 400 సౌత్‌ ఏసియన్స్‌లో అడివి శేషు ఉన్నారు. ఆర్ట్స్, మీడియా, కల్చర్‌లలోని ప్రముఖులు ఈ లిస్ట్‌లో చోటు సాధించారు. ఈ విషయాన్ని ఓ వీడియోలో వెల్లడించారు ఈ నటుడు. (మూడేళ్ల డేటింగ్‌.. ఏడేళ్ల ఫ్రెండ్‌షిప్‌.. కాజల్ ప్రేమ కథ ఇదే)

2020కి గానూ 400 మోస్ట్‌ ఇన్ల్ఫూయెన్సియల్‌ లిస్ట్‌లో నేను కూడా ఉన్నారు. నన్ను, నా పనిని గుర్తించిన న్యూయార్క్ ప్రెస్‌ న్యూస్ ఏజెన్సీకి థ్యాంక్స్‌. ఏఆర్ రెహమాన్‌, సోనూ నిగమ్‌, రెహత్‌ ఫతే అలీ ఖాన్‌, అద్నాన్ సమీ, జాకీర్‌ హుస్సేన్‌ వంటి వారితో పాటు ప్రముఖ జర్నలిస్ట్‌ కిరణ్ రాయ్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేశారు అని తెలిపారు. (రామ్‌తో మూడోసారి అనుపమ..!)

కాగా క్షణం, గూడచారి వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అడివి శేషు ప్రస్తుతం మేజర్ చిత్రంలో నటిస్తున్నారు. 26/11 ముంబయి ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శేషు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌గా కనిపించనున్నారు. ఈ మూవీని సూపర్‌స్టార్ మహేష్‌ బాబు నిర్మించడం విశేషం. ( ‘కాఫీ విత్‌ సీఎం’.. గోవా ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రామ్‌)