బారాముల్లా జిల్లాలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు వీరమరణం..
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. శనివారం రోజున నార్త్ కశ్మీర్లోని బారాముల్లా జిల్లాల్లో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో.. ఉహద్బాబ్ క్రాసింగ్ సమీపంలోని నూర్బాగ్ వద్ద.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), పోలీసులతో కూడిన సంయుక్త బృందంపై అకస్మాత్తుగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్పటికే ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగడంతో.. పారామిలటరీకి చెందిన […]
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. శనివారం రోజున నార్త్ కశ్మీర్లోని బారాముల్లా జిల్లాల్లో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ బలగాలపై దాడికకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో.. ఉహద్బాబ్ క్రాసింగ్ సమీపంలోని నూర్బాగ్ వద్ద.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), పోలీసులతో కూడిన సంయుక్త బృందంపై అకస్మాత్తుగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.
దీంతో అప్రమత్తమైన జవాన్లు.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్పటికే ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగడంతో.. పారామిలటరీకి చెందిన ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వెంటనే వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. మరోకరు చికిత్స పొందుతూ అమరుడయ్యాడు. కాగా.. గత వారం రోజులుగా మూడు సార్లు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి.