ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 245..

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 తర్వాత కేసుల సంఖ్య రాష్ట్రంలో అమాంతం పెరిగిపోయాయి. రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో..

ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 245..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 11:55 AM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 తర్వాత కేసుల సంఖ్య రాష్ట్రంలో అమాంతం పెరిగిపోయాయి. రోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,859కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4,743 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,086 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 21 మంది మరణించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి రోజు 15వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నాటికి 5.4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 2.10 లక్షల కేసులు యాక్టివ్‌లో ఉండగా..3.21 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 16వేల మందికి పైగా కరోనా బారినపడి మరణించారు.

Latest Articles