అమెరికాపై పగబట్టిన ప్రచండభానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు..

|

Jun 09, 2024 | 7:00 AM

అధిక ఉష్ణోగ్రతలతో అమెరికా మండిపోతుంది. మండే ఎండల దాటికి డొనాల్డ్ ట్రంప్ సభకు వచ్చిన 11మంది వడదెబ్బకు గురయ్యారు. మనకు మన్నటి వరకు వేసవితాపం హాహాకారాలు చేయించినప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకి నిప్పులు చెరుగుతుండడంతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అమెరికాపై పగబట్టిన ప్రచండభానుడు.. విలవిలలాడుతున్న ప్రజలు..
America
Follow us on

అధిక ఉష్ణోగ్రతలతో అమెరికా మండిపోతుంది. మండే ఎండల దాటికి డొనాల్డ్ ట్రంప్ సభకు వచ్చిన 11మంది వడదెబ్బకు గురయ్యారు. మనకు మన్నటి వరకు వేసవితాపం హాహాకారాలు చేయించినప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. రోజు రోజుకి నిప్పులు చెరుగుతుండడంతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు మంచుతుఫాన్లతో, భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన అమెరికన్లు.. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని నైరుతీ రాష్ట్రాలను భానుడి ప్రచండతాపం బెంబేలెత్తిస్తోంది. ఆగ్నేయ క్యాలిఫోర్నియా మొదలుకొని అరిజోనా, నెవడా రాష్ట్రాల వరకు రెండుమూడు రోజుల క్రితం పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. నెవాడా రాష్ట్రంలోని లాస్‌ వేగాస్‌లో నిన్న కూడా వేడి గాలులు కొనసాగాయి. నైరుతి అమెరికాలో వేసవి మొదలుకావడానికి ఇంకా రెండు వారాల వ్యవధి ఉన్నా సూర్య ప్రతాపం ముందే మొదలైంది.

ఫినీక్స్‌ పట్టణంలో 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై కొత్త రికార్డు నెలకొల్పింది. ఫినీక్స్‌లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ సభకు వచ్చిన వారిలో 11 మంది వడదెబ్బ తగలడంతో ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. నెవడా రాష్ట్రంలోని రీనో నగరంలో సాధారణంగా 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. రెండు క్రితం అక్కడ 37 డిగ్రీలు నమోదైంది. అరిజోనా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కొనసాగనున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్‌కు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2015 ప్యారిస్‌ వాతావరణ చర్చల్లో విధించుకున్న పరిమితి దాటిపోతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ప్రతీ గంట వేడిగా మారుతోందని తెలిపారు. ఉదయం పూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, తగినన్ని మంచినీరు తాగాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. 2016లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మునుపటి రికార్డులు బద్దలవుతాయని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..