‘వాటర్ బెల్’ క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?

‘వాటర్‌ బెల్’ ఈ కార్యక్రమం.. ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ జోరందుకుంటోంది. స్కూళ్లల్లో.. సరైన నీరు తాగని కారణంగా.. స్టూడెంట్స్ ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూంటారు. మరీ వీక్‌గా ఉన్న పిల్లలు.. కళ్లు తిరిగి పడిపోతూంటారు. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో అధికంగా ఉంటుంది. దీంతో.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా.. కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ […]

'వాటర్ బెల్' క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 4:17 PM

‘వాటర్‌ బెల్’ ఈ కార్యక్రమం.. ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ జోరందుకుంటోంది. స్కూళ్లల్లో.. సరైన నీరు తాగని కారణంగా.. స్టూడెంట్స్ ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూంటారు. మరీ వీక్‌గా ఉన్న పిల్లలు.. కళ్లు తిరిగి పడిపోతూంటారు. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో అధికంగా ఉంటుంది. దీంతో.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా.. కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో.. స్టూడెంట్స్ నీరు తాగేలా.. టీచర్స్‌ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. ఇప్పుడు ఇదికాస్తా.. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం ఈ కార్యక్రమంపై దృష్టి పెడుతున్నారు.

ఈ ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తమిళనాడులోని పాఠశాలల్లో కూడా పాటిస్తున్నారు. ప్రతీ పిరియడ్‌కు మధ్య పది నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్ ప్రకటించారు. అలాగే.. ఇప్పుడు ఈ ‘వాటర్ బెల్‌’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అన్ని స్కూళ్లల్లోనూ.. ప్రతిస్టాత్మకంగా.. తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నారట. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు.. అన్ని ప్రైవేటు స్కూళ్లల్లో దీన్ని అవలంభించాలని.. విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోజుకు కనీసం.. 3 నుంచి 4 సార్లు అయినా.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎందుకు అవసరం..?

  • ‘వాటర్ బెల్’ కార్యక్రమం ద్వారా.. ముఖ్యంగా విద్యార్థులు.. డీ హైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటారు.
  • అంతేకాకుండా.. ఈ పదినిమిషాల బ్రేక్ ద్వారా విద్యార్థులకు కాస్త ఒత్తిడిని తగ్గించవచ్చు.
  • చదువుపై ధ్యాస పెట్టేలా కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
  • అలాగే.. స్టూడెంట్స్‌కి కాస్త ఉపశమనం లభించినట్టు కూడా ఉంటుంది.
  • నీరు తాగిన కారణంగా.. పిల్లల్లో రక్తప్రసరణ చురుగ్గా జరుగుతుంది.
  • జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.
  • రోజూ ఇలా నీరు త్రాగడం వలన… అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.