ఎంత ఘోరం.. ? వివస్త్రను చేసి వీడియో
హనుమకొండ జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో ఒక మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తప్పు చేశానని బాధిత మహిళ ఎంత వేడుకున్నా గ్రామస్తులు వినకుండా దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం, బోలోల్లు పల్లెకి చెందిన రాజుకి వివాహం జరిగింది. కాగా రాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పది రోజుల క్రితం ఈ జంట గ్రామం నుంచి పారిపోయారు. అయితే వీరిద్దరినీ గాలించి పట్టుకొచ్చిన రాజు కుటుంబ సభ్యులు తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి అరగుండుగీయించారు. తర్వాత బాధిత మహిళను వివస్త్రను చేసి ఇనుప చెట్టుకు కట్టేసి ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధకు గురిచేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి యువకులు తప్పు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాదని ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.