రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్‌.. మరీ ఇలానా? వీడియో

Updated on: Jul 09, 2025 | 1:17 PM

ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళలు గొడవ పడుతున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిఎస్‌టీ-కళ్యాణ్ లోకల్ ట్రైన్‌లో డోంబివిలి సమీపంలో ఈ ఘటన జరిగింది. కిక్కిరిసిన రైలులో మహిళా ప్రయాణికులు ఘర్షణకు దిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్ వైరల్ అయింది.

 వైరల్ వీడియోలో ఒక మహిళ మరొక మహిళ జుట్టును గట్టిగా పట్టుకుని ఉండగా.. మిగిలిన మహిళలు వారిని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను చూసిన కొంతమంది ప్రయాణికులు ఫోన్ చేసి సమాచారం అందించారని రైల్వే పోలీసు వర్గాలు తెలిపాయి. రైలు కుర్లా చేరుకోగానే పరిస్థితిని పరిష్కరించడానికి కుర్లా RPF బృందం అక్కడికి చేరుకుంది. కానీ అప్పటికే గొడవ పడిన మహిళలు దిగిపోయారు. వీడియో చూసిన నెటిజన్లు.. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందన్నారు. దాంతోపాటే దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇదేమైనా లోకల్ ట్రైన్ అనుకుంటున్నారా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి పరిస్థితులు మారాలంటే రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

కస్టమ్స్‌ చేతికి చిక్కిన 16 అరుదైన పాములు వీడియో

సారీ నాన్న.. ఇక భరించలేను..! పెళ్లైన 2 నెలలకే నవ వధువు సూ*సైడ్ వీడియో

మా అమ్మ చనిపోదామంటోంది… ఆదుకోండి కలెక్టర్‌కు బాలుడు విజ్ఞప్తి వీడియో