రోడ్డుపై రన్‌వే..చైనాకు దగ్గర్లో మోదీ విమానం

Updated on: Feb 15, 2026 | 3:40 PM

దేశంలోని కొన్ని హైవేలపైన విమానం అత్యవసర ల్యాండింగ్‌ కోసం రన్‌వేలు నిర్మిస్తున్నారు. చైనా బార్దర్‌ను ఆనుకుని అస్సాంలో అలాంటి హైవే రన్‌వేపై ప్రధాని మోదీ విమానం ల్యాండ్‌ అయింది. అస్సాంలో ఎన్‌హెచ్‌ 37పై ప్రధాని ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయ్యింది. చైనా బోర్డర్‌కు 300 కి.మీ. దూరంలో ఇది ఉంది. తొలిసారి రాజస్థాన్‌లో బర్మేర్‌లో హైవేపై విమానం రన్‌వే అందుబాటులోకి తెచ్చారు.

అస్సాంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యటన కు వెళ్లిన ప్రధాని మోదీ 37వ నెంబరు జాతీయ రహదారి పై విమానం నుంచి దిగారు. యుద్ధ విమానాలు, రవాణా విమానాలకు వ్యూహాత్మక రన్‌వేగా పనిచేస్తుంది. 40 టన్నుల వరకు యుద్ధ విమానాలను, గరిష్టంగా 74 టన్నుల వరకు రవాణా విమానాలను ఇది నిర్వహిస్తుంది. అంతకు ముందు ప్రధాని మోదీ ఎక్స్‌ లో స్పందిస్తూ ‘‘అత్యవసర ప్రతిస్పందనకు ELF చాలా కీలకమని, సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను సకాలంలో చేపట్టడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. రూ. 100 కోట్లతో మోరెన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ. మేర రన్‌వేను ఏర్పాటుచేశారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!