కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ శ్రీక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలోనిరత్న భాండాగారంలో అపార సంపదలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే, 40 ఏళ్లుగా ఈ రత్నభాండాగారం తెరవలేదు. అయితే, జులై 7 తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్టు పురావస్తుశాఖ బుధవారం ప్రకటించింది. లోపల మరమ్మతులు చేపడతామని వెల్లడించింది. ఇక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒడిశాలో మొదటిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలు తెరిచి భక్తులను అనుమతించింది. తాజాగా, రత్నభాండాగారంపై ఒడిశా సర్కారు దృష్టిసారించింది.
జగన్నాథ ఆలయ అనువంశిక ధర్మకర్త పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ అధ్యక్షతన బుధవారం పాలకవర్గం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో రత్నాభాండాగారం తెరిచే అంశంపై ప్రస్తావన రాలేదు. కానీ, పాలకమండలి భేటీ అనంతరం ASI సూపరింటెండెంట్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే రథయాత్ర మర్నాడు జులై 8న ఆలయ ఖజానా తలుపులు తెరిచి మరమ్మతులు చేపడతామని ఆయన వివరించారు. ఐదేళ్ల కిందట 2019 ఫిబ్రవరి 4న నిపుణుల కమిటీ రత్నభాండాగారం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైంది. తాళం చెవి కనిపించకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయింది.వెలుపల నుంచే పరిశీలించిన కమిటీ సభ్యులు.. గోడలు, పైకప్పు బలహీనంగా మారి, పగుళ్లు ఏర్పడినట్లు గుర్తించారు. అనంతరం ASI అధికారులు లేజర్ స్కానింగ్ ద్వారా దీనిని ధ్రువీకరించారు. ప్రస్తుత మరమ్మతులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్కమిటీ, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు జరుగుతాయని సూపరింటెండెంట్ వివరించారు. అయితే, ఎన్ని రోజుల్లో ఇది పూర్తవుతుందనేది స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, స్వామివారి ఆభరణాల లెక్కింపు అంశంపైనా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.