నీట్- యూజీ ప్రవేశపరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్లో ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం ఇంకా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటికొచ్చింది. ముందురోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బిహార్లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. బిహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసింది. వీరిలో బిహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజినీర్తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరిలో ఓ అభ్యర్థి జూనియర్ ఇంజినీర్కు స్వయానా మేనల్లుడు.
రాజస్థాన్లోని కోటాలో నీట్కు ప్రిపేర్ అవుతున్న తనకు మామయ్య ఫోన్ చేశారనీ, ఇంటికి రమ్మని చెప్పారని ఆ విద్యార్థి అన్నాడు. నీట్ పరీక్ష ముందు రోజు మే 4వ తేదీ రాత్రి తన స్నేహితులను తీసుకుని తాను మామయ్య వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడ తనకు నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారనీ రాత్రంతా వాటిని తాము బట్టీపట్టామనీ మరుసటి రోజు పరీక్షా కేంద్రానికి వెళ్లిన తర్వాత ప్రశ్నపత్రాన్న చూస్తే.. ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్తో పూర్తిగా మ్యాచ్ అయ్యిందని సదరు నీట్ అభ్యర్థి పోలీసులకు చెప్పాడు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. దీంతో నీట్ అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.