తెలంగాణలో తాజాగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నమోదైన కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొత్తేడాదికి ముందు జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. చిన్నారులకు కరోనా వైరస్ సోకడం కలవరపెడుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 20 బెడ్స్తో ప్రత్యేకంగా పిడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఎంజీఎం సుపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. కరోనా బాధితులకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్.. కరోనా పాజిటివ్గా తేలిన చిన్నారుల వయసు ఒకటి నుంచి రెండేళ్లలోపే. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్కు పంపారు. ఒక్కరిని మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.