విశ్వనగరంగా అభివృద్ది చెందిన భాగ్యనగరం కొత్త హంగులు సంతరించుకుంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్కు ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి అద్దె ప్రాతిపదికన మరి కొన్ని బస్సులను తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో 10 డబుల్ డెక్కర్ బస్సులున్నాయి. ఇందుకు సంబంధించి నవంబర్ 21 వరకు టెండరు దాఖలు చేయాలని టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. ప్రజారవాణాను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లు పిలిచింది. వచ్చే ఏడాది తొలి అంకం నాటికి 10 డబుల్ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.