Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచార హోరు.. ప్రత్యర్థులపై నేతల విమర్శల వర్షం

Updated on: Nov 27, 2023 | 6:29 PM

Telangana Polls 2023: తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.

తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రచారంలో 8 మంది కీలక నేతలు చేసిన కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..

మంగళవారం (నవంబరు 28) సాయంత్రం 5 గం.లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30 పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.