PM Modi Road Show: ప్రధానిపై పూలు చల్లుతూ ప్రేమను చాటుకున్న జనం

Updated on: Nov 27, 2023 | 6:11 PM

తెలంగాణలో క్యాంపెయిన్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడబోతోంది. దాంతో, క్లైమాక్స్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు నేతలు. ప్రధాని మోదీ అయితే హైదరాబాద్ సిటీలో మెగా షో చేశారు. కిలోమీటర్లకొద్దీ రోడ్‌షో చేస్తూ నగరంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు.

తెలంగాణలో క్యాంపెయిన్‌ క్లైమాక్స్‌కి వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడబోతోంది. దాంతో, క్లైమాక్స్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు నేతలు. ప్రధాని మోదీ అయితే హైదరాబాద్ సిటీలో మెగా షో చేశారు. కిలోమీటర్లకొద్దీ రోడ్‌షో చేస్తూ నగరంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. సిటీలోని కీలక నియోజకవర్గాల మీదుగా ఈ క్యాంపెయిన్ జరిగింది. ప్రధాని రోడ్‌షోకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. రోడ్డు పొడవునా బారులు తీరి జేజేలు పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు బీజేపీ కార్యకర్తలు.

ప్రధాని మోదీ కూడా చివరి రెండు మూడు రోజులు తెలంగాణపైనే పూర్తి ఫోకస్‌ పెట్టి మరీ ప్రచారం చేశారు. తనదైన శైలిలో స్పీచ్‌లిస్తూ క్లైమాక్స్‌లో మెరుపులు మెరిపించారు. మరి, మోదీ ప్రచారం తెలంగాణలో బీజేపీని ఏ స్థాయిలో ఆదుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే!.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Nov 27, 2023 05:05 PM