Nara Lokesh: అధికారంలో ఉన్నాం.. అలకలు వద్దు

Updated on: Jan 27, 2026 | 7:51 PM

ఏపీ మంత్రి నారా లోకేష్ కూటమి కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలకలను కోవిడ్ కంటే ప్రమాదకరమైన జబ్బుగా అభివర్ణించిన లోకేష్, పార్టీ శాశ్వతమని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి వైకాపా చేసే కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటరీ కమిటీ వర్క్‌షాప్‌లో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కూటమిని విడగొట్టే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. “పార్టీ శాశ్వతం” అనే విషయాన్ని కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని లోకేష్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అలకలు వహించవద్దని, అలా చేయడం కోవిడ్ కంటే ప్రమాదకరమైన జబ్బుతో సమానమని ఆయన హెచ్చరించారు. అలకల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నష్టపోతారని లోకేష్ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bhadrachalam: మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావుకు దగ్గరగా వెళ్లిన చిన్నారులు

Akira Nandan: నటించకుండానే పవన్ కొడుకు సినిమా పూర్తి

కండలపై క్రేజు.. స్టెరాయిడ్లపై మోజు

విశాఖ చేరుకున్న భారత్ – న్యూజిలాండ్ క్రికెట్ జట్లు

Chinmayi: క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన చిన్మయి