టీడీపీ, జనసేన పొత్తుపై అమిత్ షాతో చర్చించానన్న పవన్కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ రాక్షస పొత్తుకు బీజేపీని ఒప్పించాలని పవన్ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు – పవన్ పొత్తు ఏపీ కొత్త కాదన్నారు. వీరి పొత్తును 2014లోనే ప్రజలు చూసేశారన్నారు. అప్పటి అరాచకపాలన నచ్చకే 2019లో జగన్ను ఏపీ ప్రజలు గెలిపించారన్నారు. అలాగే మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్ని అని కామెంట్ చేసిన పవన్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి. 2019లో జగన్ గెలిచిన దగ్గర్నుంచి ఆయన గ్రాఫ్ పెరిగిందే కాని.. తగ్గలేదన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ నలుగురూ ఒకే ఫ్రేమ్లోకి వచ్చారని.. జగన్ను చూసి వారు ఎలా భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు.