PM Modi: అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..

Updated on: Feb 14, 2025 | 8:46 AM

అమెరికాలో అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. భారత పౌరులు అక్రమంగా ఎవరున్నా వెనక్కి తీసుకుంటామన్నారు. పేద ప్రజలను మభ్యపెట్టి కొందరు.. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ ఎకోసిస్టమ్‌ను నాశనం చేయాలన్నారు మోదీ. అమెరికా దీనికి సహకరిస్తుందని అనుకుంటున్నానని..

అమెరికాలో అక్రమ వలసదారులపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. భారత పౌరులు అక్రమంగా ఎవరున్నా వెనక్కి తీసుకుంటామన్నారు. పేద ప్రజలను మభ్యపెట్టి కొందరు.. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ ఎకోసిస్టమ్‌ను నాశనం చేయాలన్నారు మోదీ. అమెరికా దీనికి సహకరిస్తుందని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ అమెరికా కలయిక అంటే వన్‌ ప్లస్‌ వన్‌ టు కాదు లెవెన్‌ అన్నారు మోదీ. అంటే లోక కల్యాణార్థం ఈ సంఖ్య చాలాబలమైనదన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య కీలక చర్చలు జరిగాయి. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక తొలి మీటింగ్‌ జరిగింది. క్రిమినల్స్‌ అప్పగింత, అక్రమ వలసదారులపై నిర్ణయం, ట్రేడ్‌ వార్‌కి పరిష్కారాలు, యుద్ధాలపై ప్రకటనలు వచ్చాయి. ఇక భారత్‌ అమెరికా మధ్య 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యానికి తెరతీశారు. డిఫెన్స్‌ పరికరాల కొనుగోలుపైనా అవగాహన కుదరింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us