RBI: కస్టమర్లు బీ అలెర్ట్.! ఇకపై ఆ బ్యాంక్ కనిపించదు..

Updated on: Feb 14, 2025 | 6:19 PM

న్యూ ఇండియా కోఆపరేటివ్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరగకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో.. ఉదయం నుంచి బ్యాంక్‌ ముందు ఖాతాదారుల క్యూ కట్టారు. తమ సేవింగ్స్‌ను విత్‌డ్రా చేసుకోనివ్వాలని కోరుతున్నారు. దీనిపై బ్యాంక్‌ అధికారులు స్పందించకపోవడంతో.. అంధేరీలోని విజయనగర్‌ బ్రాంచ్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

ముంబై కేంద్రంగా నడిచే న్యూ ఇండియా కోఆపరేటివ్‌ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. బ్యాంక్‌ను వెంటనే మూసేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆరు నెలల వరకు న్యూ ఇండియా కోఆపరేటివ్‌ బ్యాంకు ఎలాంటి లావాదేవీలు జరపవద్దని తెలిపింది. సేవింగ్స్‌, కరెంటు ఖాతాలే కాకుండా.. ఎలాంటి ఇతర ఖాతాల్లోని డబ్బును విత్‌డ్రా చేయడానికి కాని.. డిపాజిట్‌ చేయడానికి కాని వీల్లేదని తెలిపింది. ఈ ఆర్బీఐ ప్రకటనతో ఉదయం నుంచి బ్యాంక్‌ ఎదుట ఖాతాదారులు వేచిచూస్తున్నారు. తమ సేవింగ్స్‌ డబ్బును ఇప్పించాలని కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం బ్యాంకుకు తాళాలు వేసి.. ఎలాంటి విత్‌డ్రాలు కుదరవని తెగేసి చెబుతున్నారు. దీంతో అక్కడి పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంక్ ఎదుట బైఠాయించిన ఖాతాదారులు తమ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Feb 14, 2025 02:32 PM
Follow Us