మేడారం జాతర ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్ రైడ్స్.. డిస్కౌంట్ కూడా..

Updated on: Jan 24, 2026 | 9:15 AM

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. తెలంగాణ పర్యాటక శాఖ, తుంబి ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా హనుమకొండ నుండి రౌండ్ ట్రిప్, జాతరపై జాయ్ రైడ్స్ అందిస్తున్నాయి. ఈ సేవలతో భక్తులు సమయం ఆదా చేసుకుని, జాతరను ఆకాశం నుండి విహంగ వీక్షణం చేసే అద్భుత అవకాశం పొందవచ్చు.

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతర సమయంలో వేగంగా గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖ, తుంబి ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా అందిస్తున్న ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వాహకులు ప్రకటించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి నేరుగా మేడారం వెళ్లి, తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించారు. ఈ రౌండ్ ట్రిప్‌కు ఒక్కో వ్యక్తికి ఛార్జీ రూ. 35,999గా నిర్ణయించారు. అయితే, జనవరి 23లోపు బుక్ చేసుకున్న వారికి రాయితీ అందిస్తుండగా, వారు రూ. 30,999 చెల్లిస్తే సరిపోతుంది. ఇక, రెండో ప్యాకేజీ కింద మేడారం జాతర అందాలను ఆకాశం నుంచి వీక్షించాలనుకునే వారి కోసం ‘జాయ్ రైడ్స్’ నిర్వహిస్తున్నారు. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ గగన విహారానికి ఒక్కొక్కరికి రూ. 4,800 రుసుముగా వసూలు చేయనున్నారు. ఈ సేవలతో భక్తులు సమయం ఆదా చేసుకోవడంతో పాటు జాతరను విహంగ వీక్షణం చేసే అద్భుత అవకాశం పొందవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశం నుంచి అరసవల్లి దర్శనం..హెలికాప్టర్, బెలూన్ రైడ్స్ – టికెట్ ధరలు ఇవే

Jr NTR: ఎన్టీఆర్ కి అనారోగ్యం.. డ్రాగన్ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌

Dhurandhar 2: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది

మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు

Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో