ఈ ఏడాది ముందుగానే వచ్చిన రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా కొన్ని ప్రాంతాల్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. రుతుపవనాలు వచ్చీరాగానే పడిన వర్షాలకు రైతులు ఎంతో సంతోషంగా విత్తనాలు చల్లారు. కానీ రుతుపవనాలు తమ ప్రభావాన్ని పూర్తిగా చూపడంలేదు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో పలుచోట్ల పంటలు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తుతాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పలు చేసి పంటలు వేసిన రైతులు వర్షాలు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. వరంగల్ జిల్లా కాటారం మండలం చింతకాని, జగ్గయ్య పల్లిలో రుతుపవనాల రాకతోనే వర్షం కురిసింది. దాంతో పొలంలో రైతులు విత్తనాలు నాటారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో పంటను కాపాడుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గత పదిరోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. దాంతో పొలంలో చల్లిన విత్తనాలు ఎండకు మాడిపోకుండా ట్యాంకులతో నీళ్లు తెచ్చి పొలాలను తడుపుతున్నారు. ట్యాంకర్కు డ్రిప్పింగ్ స్పేర్ పార్ట్స్ అమర్చి ట్యాంకర్ ద్వారా విత్తనాలు తడుపుతున్నారు. అవి మొలకెత్తుతాయో, ఎండవేడికి ఉడికిపోతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్.. రాహుల్ గాంధీ వల్లే డిమాండ్ పెరిగిందన్న ప్రచురణ సంస్థ డైరెక్టర్
వందే భారత్ స్లీపర్ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు
డీజే సిద్ధార్థ్కు డ్రగ్స్ పాజిటివ్.. ఎవరీ సిద్దార్థ్ ??
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా