ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని చెర్రీ దంపతులు ప్రత్యేక పూజలు
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు ఆర్నెళ్లు కంప్లీట్ అవ్వడంతో.. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు.. వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ జంట ఆలయాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు ఆర్నెళ్లు కంప్లీట్ అవ్వడంతో.. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు.. వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సయయంలో కూడా పాప ఫేస్ కనిపించకుండా వారు జాగ్రత్తపడ్డారు. ఈ సంవత్సరం జూన్ 20 న చెర్రీ – ఉపాసన దంపతులకు ఉపాసన జన్మించింది. రామ్ చరణ్, ఉపాసనల నిశ్చితార్థం డిసెంబర్ 11, 2011 న హైదరాబాద్లో జరిగింది. జూన్ 14, 2012న వివాహ బంధంతో వారు ఒక్కటయ్యారు.
RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..