మెట్రో రైల్‌ పై కూలీ పోస్టర్.. దెబ్బకు దడదడలాడించిన NTR ఫ్యాన్స్‌

Updated on: Aug 12, 2025 | 4:37 PM

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. తమ అభిమాన హీరో బాలీవుడ్‌ డెబ్యూ ఇస్తున్న వార్ 2 సినిమా గురించే వారి మధ్య చర్చ నడుస్తోంది. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్‌ ను శాసించాలనే మాట వారి నుంచి వస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో మా వోడే టాప్ హీరో కావాలనే కోరిక... బలంగా వినిపిస్తోంది.

అయితే ఇదంతా ఓ వీడియో కనిపించింది,. ఇప్పుడా వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రజినీ మధ్య ఇప్పుడు పోరు సాగుతోంది. కూలీ, వార్ 2 రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ తమ హీరోను సపోర్ట్ చేయడం ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే వార్ 2 ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది. అయితే ఈ ఈవెంట్‌ ముగియగానే రిటర్న్‌ అయిన కొంత మంది తారక్ ఫ్యాన్స్‌కు యూసఫ్ గూడ మెట్రో స్టేషన్లో.. కూలీ పోస్టర్ ఉన్న మెట్రో ట్రైన్ వస్తూ కనిపించింది. అంతే కూలీ పోస్టర్ ఉన్న మెట్రో ట్రైన్ తమకు కనింపచడమే ఆలస్యం.. జై ఎన్టీఆర్ అని అరుస్తూ.. ఒక్క సారిగా తమ అభిమానం చూపించారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. దీంతో యూసఫ్‌ గూడ మెట్రో స్టేషన్స్… తారక్ ఫ్యాపన్స్‌ క్రేజ్‌తో ఊగిపోయింది. కూలీ పోస్టర్ కనిపిస్తేనే పరిస్థితి ఇలా ఉందంటే.. రేపు థియేటర్లలో తమ హీరో సినిమాపై తారక్‌ ఫ్యాన్స్‌ ఇంకే రేంజ్‌లో ప్రేమను చూపిస్తారో చూడాలనే కామెంట్ నెట్టింట వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైజాగ్ బస్టాండ్‌లో విషాద ఘటన.. ప్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి