బాలీవుడ్‌లో మన హీరోయిన్ల పరిస్థితి ఏంటి

Updated on: Feb 18, 2026 | 8:40 PM

బాలీవుడ్‌లో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడానికి దక్షిణాది నటీమణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ వంటి వారు ఇప్పటికే సినిమాలు చేసినా, మరికొందరు నయనతార, రష్మిక మందన్న, సాయి పల్లవి, సంయుక్త మీనన్ వంటి వారు కొత్తగా ప్రయత్రాలను ప్రారంభించారు. వారి కృషి, భవిష్యత్ ప్రాజెక్టులపై ఒక సమగ్ర పరిశీలన ఇది.

దక్షిణాది సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్న మన నటీమణులు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు అక్కడ తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, మరికొందరు కొత్త ప్రాజెక్టులతో ఉత్తరాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి ఆశలు ఆసక్తికరంగా మారాయి. పూజా హెగ్డే ఇప్పటికే నార్త్ సినిమాల్లో నటించారు. సౌత్‌లో పెద్ద ప్రాజెక్టులను కూడా వదులుకుని బాలీవుడ్‌పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి ఇష్క్ హోనాహై చిత్రంలో నటిస్తున్నారు, ఇది జూన్‌లో విడుదల కానుంది. మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ కూడా బాలీవుడ్‌లో విజయాల కోసం ఎదురుచూస్తున్నారు. కీర్తి రాజ్ కుమార్ రావుతో ఓ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టైటిల్ దగ్గర్నుంచే మొదలైన సెన్సార్ కత్తెర.. అసలు కారణం ఇదేనా

Mahesh Babu: మహేష్ బాబు తగ్గేదేలే.. అప్పుడే తదుపరి సినిమా పై అప్డేట్

తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..

సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా

సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌

Follow Us