ఆరుగురికి పునర్జన్మనిచ్చిన ఇంజనీరింగ్‌ విద్యార్థి!

Updated on: Feb 15, 2026 | 11:50 AM

చేతికందిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయినా.. ఆ పుత్రశోకాన్ని దిగమింగుకుని మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు ఆ తల్లిదండ్రులు. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కందిమళ్ల విజయకుమార్ అవయవదానంతో ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.చేతికందిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయినా.. ఆ పుత్రశోకాన్ని దిగమింగుకుని మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు ఆ తల్లిదండ్రులు. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కందిమళ్ల విజయకుమార్ అవయవదానంతో ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విజయ్, ఫిబ్రవరి 6న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయ్.. విధి వంచనతో ఈ నెల 11న బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. కన్న కొడుకు ఇక తిరిగి రాడని తెలిసినా, తన కొడుకు మరికొందరి రూపంలో బ్రతకాలన్న ఆశతో తండ్రి సైదేశ్వరరావు, కుటుంబ సభ్యులు అవయవదానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ జీవన్ దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ్ అవయవాలను సేకరించి, అత్యంత వేగంగా అవసరమైన రోగులకు తరలించారు. గుండె, కాలేయం, మణిపాల్ ఆసుపత్రిలోని అవసరమైనవారి కోసం అక్కడకి తరలించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి ఊపిరితిత్తులను తరలించగా గుంటూరు విధాత ఆస్పత్రికి కిడ్నీలు, విజయవాడ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి కార్నియాను తరలించారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!