PM Modi: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం: ఫ్రాన్స్‌ పర్యటనలో మోదీ

Updated on: Feb 12, 2025 | 9:19 AM

PM Modi: మూడురోజుల ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ టూర్‌లో ఇది చివరిరోజు. ఇవాళ ఫ్రాన్స్‌లో భారత రెండో కాన్సులేట్‌ను ప్రారంభిస్తారు. ఇవాళ మాసే అనే నగరంలో ఈ కాన్సులేట్‌ సేవలు ప్రారంభం అవుతాయి. మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో చనిపోయిన సైనికులకు- మజార్గస్‌ వార్‌ సిమెట్రీలో నివాళులు అర్పిస్తారు..

భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ అభివృద్ధితోనే అందరి అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. పదేళ్లలో తన పాలనలో సుస్థిర పాలన సాధించిన పెట్టుబడుల అనుకూల వాతావరణాన్నిపారిస్‌లో జరిగిన భారత్‌-ఫ్రాన్స్‌ CEO ఫోరమ్‌ మీటింగ్‌లో వివరించారు మోదీ.

మూడురోజుల ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ టూర్‌లో ఇది చివరిరోజు. ఇవాళ ఫ్రాన్స్‌లో భారత రెండో కాన్సులేట్‌ను ప్రారంభిస్తారు. ఇవాళ మాసే అనే నగరంలో ఈ కాన్సులేట్‌ సేవలు ప్రారంభం అవుతాయి. మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో చనిపోయిన సైనికులకు- మజార్గస్‌ వార్‌ సిమెట్రీలో నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌-ITER ప్రాజెక్టును మోదీ, మాక్రాన్‌ సందర్శిస్తారు.