Watch: గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..

|

Aug 30, 2024 | 1:14 PM

ఏసి లోంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించటంతో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగేశారు. ఆ మరుక్షణంలోనే కారులో మంటలు చెలరేగాయని చెప్పారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మంటలు అదుపులోకి రాలేదు. కళ్లముందే కారు పూర్తిగా కాలిపోయింది. చివరకు..

బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేమూరు నుండి కొల్లూరు వస్తున్న ఇండికా V2 కారు నడిరోడ్డుపైనే మంటల్లో కాలి బూడిదైపోయింది. కారులో ఉన్న ముగ్గురికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఏసి లోంచి పొగలు వస్తున్నట్టుగా కనిపించటంతో కారులో ఉన్నవారు వెంటనే కిందకు దిగేశారు. ఆ మరుక్షణంలోనే కారులో మంటలు చెలరేగాయని చెప్పారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తెచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మంటలు అదుపులోకి రాలేదు. కళ్లముందే కారు పూర్తిగా కాలిపోయింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow us on