AI Impact Summit Live: ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో

Updated on: Feb 19, 2026 | 10:32 AM

ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ నాలుగో రోజు ప్రారంభమైంది.. ఢిల్లీలోని భారతమండపంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. పలువురు ప్రపంచ నేతలు సహా.. వివిధ దేశాల నుంచి 500కి పైగా ఏఐ కంపెనీలు హాజరయ్యారు. పలు దేశాధినేతలు.. ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అయితే. టాప్‌ కంపెనీల CEOలతో ప్రధాని మోదీ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు.

ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ నాలుగో రోజు ప్రారంభమైంది.. ఢిల్లీలోని భారతమండపంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. పలువురు ప్రపంచ నేతలు సహా.. వివిధ దేశాల నుంచి 500కి పైగా ఏఐ కంపెనీలు హాజరయ్యారు. పలు దేశాధినేతలు.. ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అయితే. టాప్‌ కంపెనీల CEOలతో ప్రధాని మోదీ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 21 వరకు ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరగనుంది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ప్రజలు, ప్రపంచం, అభివృద్ధి అనే అంశాలపై చర్చ జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీరితో పాటు సుమారు 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సైతం సదస్సులో పాల్గొంటున్నారు. ఇండియా ఏఐ సమ్మిట్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

Published on: Feb 19, 2026 09:52 AM
Follow Us